Description
సంజీవని హనుమ రూపు
దెయ్యాలు, భూతాలు అనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గాలి సోకడం, దెయ్యం పట్టడం, చేతబడులు లాంటి తాంత్రిక శక్తుల మాట వింటే చాలు భయాందోళనలు ఆవరిస్తాయి. వీటి బారిన పడినవారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఇలాంటి దుష్ట శక్తుల బారినుండి సంజీవని హనుమ కాపాడతాడు. ఇలా సంజీవని హనుమ రూపును ధరించి స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి.
సంజీవని హనుమ రూపును ధరించి “ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహా” అనే విశేష మంత్రాన్ని నిత్యం 21 మార్లు ఉచ్ఛరిస్తే మొండి రోగాలు, డాక్టర్లకే అంతు చిక్కని జబ్బులు, దుష్ట శక్తులు పీడనం తొలగిపోవడమే కాదు, జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈ విషయాన్ని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది.
పిరికివారు, ప్రతి విషయానికి భయపడేవారు సంజీవని హనుమ రూపును ధరిస్తే ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు.
సంజీవని హనుమ రూపును ధరించినవారికి ఇష్టసిద్ధి కలుగుతుంది. అభీష్టసిద్ధి, సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. దానప్రపత్తిని, సర్వవిద్యలను కలుగజేస్తాయి.
సంజీవని హనుమ రూపును ధారణవలన స్వామి పాపాలను హరించి, చిత్తశుధ్ధిని కలుగ చేస్తాడు. బాధలు కష్టాలనుండి రక్షిస్తాడు. శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు. దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు. శరీరానికి కలిగే విష ప్రభావాలనుండి రక్షిస్తాడు. ఆయుర్దాయ కాలాన్ని పెంపొందిస్తాడు. సర్వగ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు. మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
సంజీవని హనుమ రూపును ధారణచేసి శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. “శ్రీరామజయం” అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి